గుజరాత్‌ అరుదైన దృశ్యం.. తల్లీకుమారులు పరస్పరం సెల్యూట్ ..!

గుజరాత్‌ అరుదైన దృశ్యం.. తల్లీకుమారులు పరస్పరం సెల్యూట్ ..!
కళ్లముందే పిల్లల ఎదుగుదల చూస్తుంటే తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణిచంలేనిది. గుజరాత్‌లో సరిగ్గా అలాంటి అరుదైన సంఘటనే జరిగింది.

కళ్లముందే పిల్లల ఎదుగుదల చూస్తుంటే తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణిచంలేనిది. గుజరాత్‌లో సరిగ్గా అలాంటి అరుదైన సంఘటనే జరిగింది. ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న తల్లికి డీఎస్పీ హాదాలో ఉన్న కుమారుడు ఎదురుపడ్డారు. దీంతో ఆమె కొడుకుకు సెల్యూట్ చేయగా.. కుమారుడు కూడా తల్లికి తిరిగి సెల్యూట్ చేశారు. ఈఘటన గుజరాత్‌ అరవల్లిలో.. స్వతంత్ర వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఈ అపురూప దృశ్యం ఆవష్కృతమైంది. తల్లీకుమారులు పరస్పరం శాల్యూట్‌ చేసుకుంటున్న ఫొటోను గుజరాత్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ దినేశ్‌ దాస ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story