Madhya Pradesh: చాడీలు చెప్తుందని స్నేహితురాలిపై నలుగురు అమ్మాయిల దాడి.. వీడియో వైరల్..
Madhya Pradesh: మన చుట్టూ ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి రియాక్ట్ అయినా అవ్వకపోయినా.. వెంటనే దానిని వీడియో తీసి వైరల్ చేయడం మాత్రం అందరికీ చాలా అలవాటు అయిపోయింది. అలాంటి ఘటనలు రోజుకొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కూడా అలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది.
వైరల్ అయిన ఈ వీడియోలో ఓ నలుగురు అమ్మాయిలు కలిసి మరో అమ్మాయిని విచక్షణ లేకుండా కొట్టారు. కర్రలతో కూడా ఆ అమ్మాయిపై దాడి చేశారు. ఆ అమ్మాయి ఎంత వేడుకున్నా, ఏడ్చినా వారు మాత్రం దాడి చేయడం ఆపలేదు. ఇక చుట్టూ ఉన్నవారు కూడా చూస్తూ ఉండిపోయారే తప్పా వారిని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
ఈ వీడియోలో ఉన్న బాధితురాలి పేరు నందినీ యాదవ్. తను డోమినోస్లో డెలివరీ గర్ల్గా పనిచేస్తోంది. ఇటీవల పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన తనను నలుగురు అమ్మాయిలు అడ్డుకున్నారు. ఆ తర్వాత దారుణంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారని ఎవరో ప్రశ్నించగా తమపై చాడీలు చెప్తుందని అన్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ నలుగురు తన స్నేహితులే అని చెప్పింది.
#WATCH...#Indore में #Dominos की एक महिला कर्मचारी को 4 लड़कियों की गैंग ने बेरहमी से पीटा है। इसका वीडियो सोशल मीडिया पर वायरल है। #MadhyaPradesh pic.twitter.com/yBBuCLbcBW
— rajeshkumarojha (@rajeshrepoter) June 14, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com