Social Media: హెచ్చుమీరుతున్న ట్రోలర్స్.. పసిపిల్లలనూ వదలని వైనం
![Social Media: హెచ్చుమీరుతున్న ట్రోలర్స్.. పసిపిల్లలనూ వదలని వైనం Social Media: హెచ్చుమీరుతున్న ట్రోలర్స్.. పసిపిల్లలనూ వదలని వైనం](https://www.tv5news.in/h-upload/2023/01/12/873622-1140381-untitled-design-2023-01-11t221224879-1024x585.webp)
సాంకేతికంగా వేగంగా ముందుకు దూసుకుపోతున్నాం. ప్రజల జీవితాల్లో సోషల్ మీడియా ఒక పార్ట్ అయిపోయింది. సమాచారాన్ని అత్యంత వేగంగా చేరవేసే సాధనంగా ప్రజాదారణ చూరగొంది. అయితే నాణేనికి మరోవైపు ఉన్నట్లే సోషల్ మీడియాకూ ఓ వికృత రూపం తయారైంది. దీని మాటున విషాన్ని చిమ్ముతున్న నాగుపాములు పడగవిప్పుతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా.. ఎవరిమీదైనా పిచ్చి ప్రేలాపనలతో పేట్రేగిపోతున్నారు.
భారత స్టార్ క్రికెటర్ ధోని కూతురు 7 ఏడేళ్ల జీవాపై కొందరు అసభ్యకరమైన కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. జీవాపై దాడి చేస్తామంటూ ముక్కూ ముఖం తెలియని ట్రోలర్లు పైశాచికత్వానికి యావత్ దేశం నివ్వెరపోయింది. ఆ చేదు నిజం ఇంకా మింగుడు పడకముందే... విరాట్ కోహ్లీ కూతురు 2 ఏళ్ల వామికను కూడా టార్గెట్ చేస్తూ కొందరు అగంతకులు ట్విట్టర్లో ఆ పసి కూనను రేప్ చేస్తామంటూ బెదిరింపు కామెంట్లు పెట్టారు.
జనవరి 11న వామిక రెండవ పుట్టినరోజు సందర్భంగా విరాట్ అనుష్క దంపతులు చిన్నారితో దిగిన ఫొటోను షేర్ చేయగా ట్రోలర్స్ తమ చేతివాటం ప్రదర్శించారు. ఇక ఈ కామెంట్లపై స్పందించిన DCWC ఛీఫ్ స్వాతి మలివాల్... ధోనీ, విరాట్ కూతుర్లపై అసభ్య కామెంట్లు పెట్లిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ట్విట్టర్లో రెండేళ్ల వామికా,ఏడేళ్ల జీవా పై ఇలాంటి నీచమైన కామెంట్లు ఎలా చేస్తారు అంటూ విమర్శించారు. ఆటగాళ్లు నచ్చకపోతే వారి కూతుళ్లను తిడతారా? అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో వామికా, జీవాలపై హేటర్స్ చేసిన కామెంట్ల స్క్రీన్ షాట్ ను జోడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com