కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
ఇండొనేషియాలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కలిమంతన్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు తారకన్‌ పట్టణంలోని జుటా పెర్మాయ్‌

ఇండొనేషియాలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కలిమంతన్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు తారకన్‌ పట్టణంలోని జుటా పెర్మాయ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 14 మందికిపైగా మరణించారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఈ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. అయితే, చాలా మంది గాయాలపాలవ్వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story