ఉక్రెయిన్లో ఘోర విమానం ప్రమాదం.. 25 మంది మృతి

X
By - shanmukha |26 Sept 2020 7:29 AM IST
ఉక్రెయిన్లో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి మిలటరీ విమానం కుప్పకూలి 25 మంది మరణించారు.
ఉక్రెయిన్లో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి మిలటరీ విమానం కుప్పకూలి 25 మంది మరణించారు. ఉక్రెయిన్ ఖర్కివ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. ఇంజన్ ఫెయిల్ అవ్వడమే దీనికి కారణమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని. అయితే, వారి పరిస్తితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాద సమయంలో 28 మంది ఉన్నారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com