Earthquake : టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్లో భూకంపం... భయంతో పరుగులు తీసిన జనం

తుర్కియే లో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. తుర్కియేలోని మర్మారిస్స మీపంలో మధ్యధరా సముద్రంలో ఈరోజు తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా ఉంది. ఈ భూకంపం వలన గ్రీక్ దీవి తో సహా పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. దీంతో భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇళ్ల నుంచి బయటికి పరుగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవడానికి కొంతమంది ఇళ్ల కిటికీలు, బాల్కనీల నుంచి బయటికి దూకడం వల్ల ఏడుగురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక అనేక నగరాలు, పట్టణాలు భూప్రకంపనలకు గురయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్లో ఇళ్లల్లో వస్తువులను కదిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు.
తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ(AFAD) ప్రకారం.. ఈ భూకంపం శక్తివంతమైనదే అయినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని తెలిపింది. తుర్కియే ప్రధాన ఫాల్ట్ లైన్లపై ఉండటం వల్ల భూకంపాలు సర్వసాధారణం. 2023లో సంభవించిన 7.8 తీవ్రత భూకంపంలో 53,000 మంది మరణించిన నేపథ్యంలో.. ప్రస్తుత ప్రకంపనలు స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com