Hamida Bano: ట్రావెల్‌ ఏజెంట్‌ మోసం.. 22 ఏండ్ల తర్వాత భారత్‌కు

Hamida Bano: ట్రావెల్‌ ఏజెంట్‌ మోసం.. 22 ఏండ్ల తర్వాత భారత్‌కు
X
యూట్యూబ్ వీడియొ ద్వారా విషయం వెలుగులోకి

ట్రావెల్‌ ఏజెంట్‌ చేతిలో మోసపోయి 22 ఏండ్లుగా పాకిస్థాన్‌లో ఉన్న భారతీయ మహిళ సోమవారం స్వదేశానికి చేరుకుంది. వాఘా సరిహద్దు నుంచి ఆమె భారత్‌లోకి ప్రవేశించిందని ఓ అధికారి తెలిపారు. బాధితురాలైన హమీదా బానో కథనం ప్రకారం ముంబైకి చెందిన ఆమె 2002లో పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు వచ్చింది. దుబాయ్‌లో వంట మనిషి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను మోసం చేసిన ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ ఆమెను పాకిస్థాన్‌లో వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఆమె అక్కడే ఒక పాకిస్థానీని పెండ్లి చేసుకొంది. 2022లో స్థానిక యూట్యూబర్‌ ఆమె గురించి చేసిన వ్లాగ్‌ ఆమెను తిరిగి కుటుంబం దగ్గరకు చేరేలా చేసింది.

కర్ణాటకకు చెందిన 53 ఏళ్ల హమీదా భానుకు నలుగురు పిల్లులు. అందులో ఇద్దరు ఆడపిల్లలు కాగా మిగతా ఇద్దరు మగపిల్లలు. అయితే కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో హమీదా భాను దుబాయ్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంది. కుటుంబ సభ్యులు అంతా వద్దని చెబుతున్నా వినకుండా ఓ ఏజెంట్ వద్దకు వెళ్లింది. అతడు ఖతార్‌లో వంట మనిషిగా పని ఇప్పిస్తానని చెప్పి హమీదా భానును.. అక్రమంగా పాకిస్థాన్‌లోని కరాచీకి రవాణా చేశాడు. అలా ఇళ్లూ, పిల్లలను వదిలి కరాచీ చేరిన హమీదా భాను కొన్ని రోజుల పాటు ఏడుస్తూనే ఉంది. ఇంటికి తిరిగి వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది.

ఎవరూ తెలిసిన వాళ్లు లేకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటికి తిరిగి రావడం కుదరలేదు. ఇక ఎప్పటికీ ఇండియా తిరిగి వెళ్లలేనని భావించిన ఆమె ఆకలికి తట్టుకోలేక చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించింది. కరాచీలోని మసీదుల్లో పడుకుంటూ.. జీవనం సాగించింది. ఆ తర్వాత కొంత కాలానికి కాస్త డబ్బు కూడబెట్టుకుని చిన్న దుకాణం పెట్టుకుంది. చిన్నపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేది. ఇలా కొన్నాళ్లు గడవగా.. అక్కడే ఉండే దార్ మహమ్మద్‌ను పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల తర్వాత అతడు కూడా చనిపోయాడు. మళ్లీ హమీదా భాను ఒంటరిది అయిపోయింది.

అయితే ఆమెను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఓ అబ్బాయి ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ జీవిస్తున్నాడు. అతడి పేరే వాలియుల్లా మరూఫ్. అయితే మరూఫ్ అనుకోకుండా ఓసారి హమీదా భాను గురించి తెలుసుకున్నాడు. ఈక్రమంలోనే ఆమెను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాలనుకున్నాడు. 2022లో మరూఫ్.. బెంగళూరు మహిళ షెహనాజ్‌తో పాటు హమీదా అక్రమంగా భారత్ నుంచి కరాచీ రావడం... మళ్లీ తిరిగి ఇండియా వెళ్లాలనుకోవడం వరకు అంతా చెప్పగా వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. అది కాస్తా ఫుల్ వైరల్ అయింది. ఈ వీడియో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట పడగా.. ఆమెను తిరిగి భారత్ తీసుకువచ్చేందుకు మూలం అయింది.

ఇక అప్పటి నుంచి హమీదా భానును ఇండియా తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే హమీదా గుర్తింపును ధ్రువీకరించిన అధికారులు.. ఆ తర్వాత ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు విషయం చెప్పింది. అలా హమీదా భానుకు ఇటీవలే కరాచీ నుంచి లాహోర్ వరకు ప్రయాణానికి విమాన టిక్కెట్లను అందజేసింది. ఆ తర్వాత ఆమెను వాఘా సరిహద్దుకు తీసుకువ్చి చివరకు భారత్ రప్పించారు. వచ్చిన వెంటనే హమీదా భాను తన కూతురుతో పాటు సోదరి, సోదరుడు, మేనల్లుడును కలుసుకుంది. ఇన్నేళ్ల తర్వాత వారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది.


Tags

Next Story