ఉపవాస సమయంలో కూలిన భవనం.. ఒకే కుటుంబంలోని నలుగురు
సెంట్రల్ పాకిస్థాన్లో మంగళవారం మూడంతస్తుల నివాస భవనం కుప్పకూలడంతో తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్లోని ముల్తాన్ నగరంలో కూలిపోయిన భవన శిథిలాలు సమీపంలోని ఇళ్లపై కూడా పడటంతో పలువురు గాయపడ్డారని ప్రభుత్వ సీనియర్ అధికారి రిజ్వాన్ ఖదీర్ తెలిపారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని తెలిపారు. "నా మేనల్లుడి కుటుంబం మొత్తం మరణించింది". "సెహ్రీ (ఉపవాసం) సమయంలో" తెల్లవారుజామున భవనం కూలిపోయిందని మృతుల బంధువు అష్ఫాక్ మాలిక్ తెలిపారు. “ఈ ఘటనలో నా మేనల్లుడు, మేనకోడలు, వారి పిల్లలు చనిపోయారు. ఇది వాస్తవానికి సెహ్రీ (ఉపవాసం) సమయం. తెల్లవారుజామున మా మేనల్లుడి ఇంటిపైన పేలిన గ్యాస్ సిలిండర్ కారణంగా అతడి ఇంటి పక్కన ఉన్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. నా మేనల్లుడి కుటుంబం మొత్తం మరణించారు, ”అని అతను చెప్పాడు.
పాకిస్తాన్లో భవనాలు కూలిపోవడం సర్వసాధారణం, ఇక్కడ చాలా తక్కువ నిర్మాణ సామగ్రితో భవనాలు నిర్మిస్తారు. ఖర్చులను తగ్గించడానికి భద్రతా మార్గదర్శకాలను విస్మరిస్తారు అని ఒక అధికారి తెలిపారు. జూన్ 2020లో, దేశంలోని అతిపెద్ద నగరమైన కరాచీలో అపార్ట్మెంట్ భవనం కూలిపోవడంతో 22 మంది మరణించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com