Papua New Guinea: కొండచరియలు విరిగి 100 మందికి పైగా మృతి

Papua New Guinea: కొండచరియలు విరిగి 100 మందికి పైగా మృతి
X
నిద్రలోనే మృత్యుఒడిలోకి

పాపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి భారీ విధ్వంసం దృశ్యం కనిపించింది. పాపువా న్యూ గినియాలోని మారుమూల పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా సమాధి చేసింది. 100 మందికి పైగా మరణించారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) ప్రకారం రాజధాని పోర్ట్ మోర్స్‌బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల (370 మైళ్ళు) దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కాక్లామ్ గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాపువా న్యూ గినియా అధికారులు ఆ సంఖ్యను అధికారికంగా ధృవీకరించలేదు. అయితే కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానిక గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిపై ప్రభుత్వానికి ఇంకా పూర్తి సమాచారం అందలేదని ప్రధాని జేమ్స్ మరాపే తెలిపారు. అయితే కొండచరియలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు,

ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాలను వెలికితీయడానికి, మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి PNG డిఫెన్స్ ఫోర్స్, విపత్తు అధికారులు, వర్క్స్ అండ్ హైవేస్ డిపార్ట్‌మెంట్ అధికారులను సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మరోవైపు చెట్లు, రాళ్లు శిధిలాల కింద ఉన్న మృతదేహాలను నివాసితులు బయటకు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Next Story