క్యాన్సర్‌తో మరణించిన 'పదేళ్ల' బాలిక.. రెండు రోజుల ముందు నెరవేరిన 'పెళ్లి' కోరిక

క్యాన్సర్‌తో మరణించిన పదేళ్ల బాలిక.. రెండు రోజుల ముందు నెరవేరిన పెళ్లి కోరిక
క్యాన్సర్ ఆ చిన్నారి జీవితంలో మాయని మచ్చగా మిగిలింది. పట్టుమని పదేళ్లు కూడా లేవు..

క్యాన్సర్ ఆ చిన్నారి జీవితంలో మాయని మచ్చగా మిగిలింది. పట్టుమని పదేళ్లు కూడా లేవు.. అప్పుడే ఆమెను మృత్యుదేవత తనదగ్గరకు తీసుకువెళ్లాలనుకుంది. ఎలాగూ తాను బ్రతకనని తెలుసుకుంది.. తన మనసులో ఉన్న చిన్న కోరికను నెరవేర్చమని తల్లిదండ్రులను కోరింది. ఆమె కోరిక విని ముందు అవాక్కయినా ఆ తరువాత ఆలోచించి వరుడి కోసం వెతికారు.. కన్నీళ్లతోనే తమ చిన్నారి కోరికను నెరవేర్చారు..

అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన 10 ఏళ్ల ఎమ్మా ఎడ్వర్డ్స్ లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతోంది. ఎమ్మాకు ఏప్రిల్ 2022లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది రక్తం మరియు ఎముక మజ్జపై ప్రభావం చూపే ఒక రకమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్ పిల్లల్లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఎమ్మా తల్లిదండ్రులు ఆమె క్యాన్సర్‌ను అధిగమించి సాధారణ ఆశించారు. అయితే, ఎమ్మా క్యాన్సర్‌ను నయం చేయలేమని, ఆమె కొద్ది రోజులు మాత్రమే జీవిస్తుందని డాక్టర్లు తెలిపారు. దాంతో ఎమ్మా కోరిక నెరవేర్చేందుకు మాక్ వెడ్డింగ్‌ను నిర్వహించారు బాలిక తల్లిదండ్రులు.

ఎమ్మా తల్లి న్యూయార్క్ పోస్ట్ కు వివరిస్తూ.. తమ బిడ్డ గత సంవత్సరం వరకు ఆరోగ్యంగా ఉండేది. ఒకసారి హఠాత్తుగా కింద పడిపోయింది. వెంటనే స్పృహ కోల్పోయింది. దాంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఎమ్మాను పరీక్షించిన వైద్యులు ఆమె కాలు ఎముకలలో క్యాన్సర్‌ కణం ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి అప్పటికే ఎమ్మాకు తీవ్ర నష్టాన్ని కలిగించినట్లు కనుగొన్నారు. దీని కారణంగా ఎమ్మా ఎముకలు బలహీనంగా మారాయి. వ్యాది ముదరడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story