Bangladesh : కాలువలో పడ్డ బస్సు.. 16మంది మృతి
బంగ్లాదేశ్ లో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ లోని మదారిపూర్ నుంచి ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్ద ఓ కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సుపై కూడా ప్రయాణికులు కూర్చుని వెళ్తున్నారు. బస్సులో ప్రయాణికులు నిండుగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేకున్నారు. క్షతగాత్రులను గాయల తీవ్రత ఆధారంగా హాస్పిటల్స్ కు తరలిస్తున్నట్లు షిబ్ చార్ హైవే పోలీస్ స్టేషన్ OC అబూ నయీమ్ ఎండా మోఫాజెల్ హక్ తెలిపారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణను కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com