Thailand : చెట్టును ఢీ కొట్టిన బస్సు..14మంది దుర్మరణం

Thailand : చెట్టును ఢీ కొట్టిన బస్సు..14మంది దుర్మరణం
రెండుగా చీలిపోయిన బస్సు

ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌ లో చోటు చేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని పశ్చిమ ప్రావిన్స్‌ ప్రచువాప్‌ ఖిరీ ఖాన్‌ లో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు చెట్టును ఢీకొనటంతో బస్సు రెండుగా చీలిపోయింది. బస్సు తీవ్రంగా ధ్వంసం కావటంతో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీయటానికి రెస్క్యూ టీమ్ చాలా శ్రమపడ్డారు. ప్రమాద తీవ్రత వల్ల బస్సు రెండుగా చీలిపోయిందని రాష్ట్ర ప్రసార సంస్థ థాయ్‌పిబిఎస్‌ని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story