Road Accident : ఢీకొట్టిన కారు.. 9 మంది స్పాట్ డెడ్
దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సెంట్రల్ సియోల్లోని ట్రాఫిక్ లైట్ వద్ద వేచి ఉన్న పాదచారులను కారు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు.. నలుగురు గాయపడ్డారు. దక్షిణ కొరియా అత్యవసర అధికారులు తెలిపారు. పాదచారులను ఢీకొనే ముందు ప్యాసింజర్ కారు రాంగ్ సైడ్ వెళ్లి మరో రెండు కార్లను ఢీకొట్టిందని మీడియా నివేదికలు వెల్లడించాయి. కారు డ్రైవర్ (60)ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, సియోల్ పోలీసులు ఈ నివేదికలను వెంటనే ధృవీకరించలేదు. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అత్యవసర అధికారి కిమ్ చున్-సు బ్రీఫింగ్కు తెలిపారు.
ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ తన భద్రతా మంత్రి, అత్యవసర ఏజెన్సీ చీఫ్ను బాధితులకు సహాయం చేయడానికి మెరుగైన ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సియోల్ పోలీసులు తెలిపారు. కారు రాంగ్ సైడ్లో వెళుతోందని, అప్పటికే రెండు వాహనాలను ఢీకొట్టి పాదచారులను తొక్కుకుంటూ వెళ్లిందని స్థానిక మీడియా పేర్కొంది.
సియోల్ సిటీ హాల్ సమీపంలోని కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు అకస్మాత్తుగా వేగం పుంజుకుందని ఘటనా స్థలంలో అదుపులోకి తీసుకున్న డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దక్షిణ కొరియాలో సాధారణ పట్టణ రహదారులపై వేగ పరిమితి గంటకు 50 కి.మీ.. నివాస ప్రాంతాలలో గంటకు 30కి.మీ. సెంట్రల్ సియోల్లోని జాంగ్-గు జిల్లాలో పబ్లిక్ సేఫ్టీ అధికారి కిమ్ సియోంగ్-హక్, కారు డ్రైవర్ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక డ్రగ్స్ మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com