పోలవరానికి వైఎస్ కంటే ముందుగా అంజయ్య శంకుస్థాపన చేశారు : చంద్రబాబు

పోలవరానికి వైఎస్ కంటే ముందుగా అంజయ్య శంకుస్థాపన చేశారు : చంద్రబాబు

ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ముందుగా అంజయ్య శంకుస్థాపన చేశారని చంద్రబాబు తెలిపారు. అసలు పోలవరం ప్రాజెక్టు గురించి 80ఏళ్ల నుంచే చర్చ జరిగిందన్నారు. వైఎస్ కమీషన్ల కోసం కాంట్రాక్టర్లును పదే పదే మారుస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లానని తెలిపారు.

పట్టిసీమ ప్రాజెక్టు కట్టేటప్పుడు అవినీతి చేశామని విమర్శించారని.. ఇప్పుడు అదే ప్రాజెక్టు కాంట్రాకర్టును పోలవరం ప్రాజెక్టుకు నియమించుకున్నారని తెలిపారు. అంటే అప్పుడు తప్పుడు మాటలు చెప్పారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడం కోసం అన్ని అడ్డదారులు తొక్కారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతి చేశామని సీఎం జగన్ పదే పదే ఆరోపిస్తున్నారని.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. 18 నెలల నుంచి అధికారంలో ఉన్నారు కదా.. అవినీతి చేసి ఉంటే నిరూపించకుండా.. గాడిదలు కాశారా అని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి గాలి కబుర్లు.. గాలి మాటలు.. గాల్లో తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story