India-China: తైవాన్ అధ్యక్షుడి పోస్ట్ పై స్పందించిన మోదీ
చైనా మరోసారి భారత్ పై నోరుపారేసుకుంది. తైవాన్ అధ్యక్షుడు చెప్పిన శుభాకాంక్షలకు ప్రధాని నరేంద్ర మోదీ బదులివ్వటాన్ని జీర్ణించుకోలేకపోయింది. తైవాన్ అధికారుల రాజకీయాలను న్యూదిల్లీ ప్రతిఘటించాలంటూ నోరు పారేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే ఎక్స్ లో పోస్ట్ చేశారు. హృదయ పూర్వక సందేశానికి కృతజ్ఞతలని తైవాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఎక్స్ లో బదులిచ్చారు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను తాము కోరుకుంటామని పేర్కొన్నారు. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం తాము పనిచేస్తామని తెలిపారు. దీనిపై న్యూదిల్లీ వద్ద తమ నిరసన వ్యక్తంచేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. తైవాన్ ప్రాంతానికి అసలు అధ్యక్షుడే లేరని అన్నారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలు.. తైవాన్ అధికారులతో అధికారిక సంభాషణలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో చైనా ఒక్కటే ఉందని తైవాన్ కూడా అందులోని భాగమేనని వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందడంపై హర్షం వ్యక్తంచేస్తూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తే ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ విజయానికి గానూ నరేంద్రమోదీకి అభినందనలు. మీ నాయకత్వంలో భారత్, తైవాన్ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్నాం. ఇండోపసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత, ఇతర రంగాలపై ఇరు దేశాల సహకారం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని లాయ్ రాసుకొచ్చారు.
ఈ పోస్ట్కు మోదీ బదులిస్తూ.. ‘‘మీ హృదయ పూర్వక సందేశానికి కృతజ్ఞతలు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను మేం కోరుకుంటాం. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం మేం పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే, ఈ సంభాషణలపై బీజింగ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై న్యూదిల్లీ వద్ద తమ నిరసన వ్యక్తంచేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.
‘‘తైవాన్ ప్రాంతానికి అసలు అధ్యక్షుడే లేడు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగిఉన్న దేశాలు.. తైవాన్ అధికారులతో అధికారిక సంభాషణలు జరపడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. తైవాన్ కూడా అందులోని భూభాగమే. తైవాన్ అధికారుల రాజకీయాలను భారత్ ప్రతిఘటించాలి’’ అని ఆమె అన్నారు.
శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్లో ఇటీవల చైనా వ్యతిరేకి అయిన లాయ్ చింగ్ తే కొత్త అధ్యక్షుడిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం బీజింగ్ను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ద్వీపం తమ భూభాగమేనంటూ గత కొన్నేళ్లుగా వాదిస్తున్న డ్రాగన్కు ఈ వ్యాఖ్యలు మింగుడుపడలేదు. దీంతో తైవాన్ చుట్టూ భారీఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com