సరిహద్దుల్లో మరోసారి కపటబుద్ధిని ప్రదర్శించిన చైనా

సరిహద్దుల్లో మరోసారి కపటబుద్ధిని ప్రదర్శించిన చైనా
సరిహద్దుల్లో మరోసారి కపటబుద్ధిని ప్రదర్శించిన చైనా

సరిహద్దుల్లో తన కపటబుద్ధిని మరోసారి ప్రదర్శించింది చైనా. బోర్డర్‌లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు కొనసాగుతున్న వేళ దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు ప్రయత్నాలతో పాటుగా ప్యాంగ్‌యాంగ్‌ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టింది డ్రాగన్. తాజాగా చైనా దూకుడు చర్యకు సంబంధించిన శాటిలైట్‌ ఫొటోలు బయటకు వచ్చాయి. డోక్లాం, నకులా, సిక్కిం సెక్టార్ల వద్ద డ్రాగన్‌ కొత్తగా రెండు ఎయిర్‌ డిఫెన్స్‌ స్థావరాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. డోక్లాం పీఠభూమిలో భారత్‌- చైనా-భూటాన్‌ ట్రై జంక్షన్‌లో ఆర్మీ కార్యకలాపాలకు వీలుగా కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.

మూడేళ్ల క్రితం భారత్‌- చైనాల మధ్య ఘర్షణలకు దారి తీసిన సమస్యాత్మక ప్రాంతాలకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌ ఢిపెన్స్‌ బేస్‌లను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్యాలను పక్కాగా ఛేదించడంతోపాటు..అధునాతన క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా ఈ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది చైనా..ఇప్పటికే బలగాల ఉపసంహరణ విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది డ్రాగన్. తూర్పు లదాఖ్‌లోని ఫింగర్‌ 5, 8 ఏరియాల్లో డ్రాగన్‌ తన బలాన్ని మరింత పెంచుకున్నట్లు సమాచారం. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పడవలు తరలించి, గుడారాలు నిర్మించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో డోక్లాం వద్ద కూడా చైనా కవ్వింపు చర్యలకు దిగడం చూస్తుంటే ఇరు దేశాల వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2017తో డోక్లాం విషయంలో భారత్‌- చైనాల మధ్య సుమారు 73 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. అనేక చర్చల అనంతరం అప్పటి వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.

Tags

Read MoreRead Less
Next Story