8నెలల గర్భిణి పొట్ట కోసి బిడ్డను అపహరించి..

8నెలల గర్భిణి పొట్ట కోసి బిడ్డను అపహరించి..
మరణ శిక్షను అమలు పరచాలని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం గత జూలై నెలలో..

67 సంవత్సరాలలో తొలిసారిగా మహిళా ఫెడరల్ ఖైదీని ఉరి తీయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోందని డోనాల్డ్ ట్రంప్ న్యాయ విభాగం తెలిపింది. 2004 లో మిస్సౌరీ అనే ఓ ఎనిమిది నెలల గర్భిణిని గొంతు కోసి, పుట్టబోయే బిడ్డను దొంగిలించిన లిసా మోంట్‌గోమేరీని.. డిసెంబర్ 8 న ఇండియానాలోని టెర్రె హాట్‌లోని యుఎస్ జైలు సిబ్బంది ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా ఆమెకు మరణ శిక్ష విధించనున్నారు.

1953 డిసెంబర్‌లో బోనీ బ్రౌన్ హేడీకి యుఎస్ ప్రభుత్వం మరణశిక్షవిధించింది. తన ప్రియుడితో కలిసి ఆమెను గ్యాస్ చాంబర్‌లో ఉరితీశారు.రాష్ట్ర జైళ్లలో, 1976 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత యుఎస్ అంతటా మరణశిక్షపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుండి 16 మంది మహిళలకు ఉరిశిక్ష విధించబడింది. అమెరికాలో 2003 నుంచే మరణశిక్ష అమలు కావడం లేదు. మరణ శిక్షను అమలు పరచాలని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం గత జూలై నెలలో నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story