Plane Crash: సౌత్ కొరియాలో విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం..

Plane Crash: సౌత్ కొరియాలో విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం..
X
ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యంతోనే ప్రమాదం..

దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థ్యాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి ముయాన్‌కు వచ్చిన బెజూ ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందని 7C2216 బోయింగ్‌ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. రన్‌వేపై రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని 179 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయపడ్డారు. ఘటనా సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నట్లు జెజూ విమానయాన సంస్థ ప్రకటించింది. కాగా, విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానం రన్‌వేకు తగిలింది. ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్‌వే పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీటు గోడను ఢీకొట్టడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయని తెలిపారు. దట్టమైన నల్లని పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. 32 అగ్ని మాపక ట్రక్కులు, హెలికాప్టర్లు హుటాహుటిన అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే అంతా మృత్యువాతపడ్డారు. ఇద్దరు విమాన సిబ్బంది మినహా మిగతా అందరూ చనిపోయినట్లు నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 173 మంది దక్షిణ కొరియాకు చెందినవారు కాగా, ఇద్దరు థాయ్‌ జాతీయులని తెలిపారు.

ఈ ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ సాంగ్‌ మోక్‌ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రమాదం నేపథ్యంలో ముయాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు

Tags

Next Story