అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. అయితే కార్గో విమానాలపై, అలాగే డీజీసీఏ అనుమతి పొందిన విమానాలపై ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story