భారీ భూకంపం.. 22 మంది మృతి..

X
By - kasi |30 Oct 2020 7:13 PM IST
పశ్చిమ టర్కీలోని ఏజియన్ సముద్రం తీరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది, ఇది రిక్టర్ స్కేల్లో 7.0 గా నమోదయింది. భూప్రకంపనల ధాటికి..
పశ్చిమ టర్కీలోని ఏజియన్ సముద్రం తీరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది, ఇది రిక్టర్ స్కేల్లో 7.0 గా నమోదయింది. భూప్రకంపనల ధాటికి 22 మంది మృతి చెందగా.. వెయ్యిమందికి పైగా గాయాలపాలయ్యారు.. అనేక భవనాలు కుప్పకూలాయి.. భూకంపానికి పశ్చిమ టర్కీలోని ఇజ్మీర్ నగరం ఎక్కువగా ప్రభావితం అయింది. ఇక్కడ అనేక ఇల్లు నేలమట్టం అయ్యాయి. ఇజ్మీర్ నగరం టర్కీ దేశంలోనే మూడవ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com