Earthquakes : ఈక్వెడార్ లో భూకంపం.. 13మంది మృతి
By - Vijayanand |19 March 2023 1:00 AM GMT
ఈక్వెడార్ లో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 13మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఈక్వెడార్, ఉత్తర పెరు తీరప్రాంతంలో బటమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో బహుల అంతస్థుల భవనాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్కో మాట్లాడుతూ భాదితులకు సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప తీవ్రత 6.8 నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుయాస్ ప్రావిన్స్ లోని బాలావో నగరానికి 10కిలోమీటర్ల దూరంలో 66.4 కిమీ లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com