Man Kills wife: కుంభమేళాకి తీసుకెళ్లి భార్య హత్య..

ఒక వ్యక్తి తన భార్యను కుంభమేళాకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేశాడు. కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు. మహిళ హత్య గురించి తెలుసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని త్రిలోక్పురికి చెందిన అశోక్ కుమార్ తన భార్య మీనాక్షితో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. ఫిబ్రవరి 18న ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్కు వారు చేరుకున్నారు. కుంభమేళాలో సాన్నంతోపాటు ఇతర ఫొటోలు, వీడియోలను తన పిల్లలకు అశోక్ కుమార్ పంపాడు. తమ టూర్ సంతోషంగా సాగుతున్నట్లు వారికి చెప్పాడు. ఒక సత్రంలో వారు బస చేశారు. అయితే ఆ రాత్రి అక్కడి బాత్ రూమ్లో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఢిల్లీ చేరుకున్న అతడు కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు.
కాగా, ఫిబ్రవరి 18న బాత్రూమ్లో మహిళ మృతదేహాన్ని ఆ సత్రం మేనేజర్ గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ కనిపించడం లేదంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఇది తెలుసుకున్న మీనాక్షి సోదరుడు తన కుమారులతో కలిసి ప్రయాగ్రాజ్ చేరుకున్నాడు. సోదరి మృతదేహాన్ని గుర్తించాడు. దీంతో ఆమె భర్త అశోక్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు తండ్రి మాటలు నమ్మని పిల్లలు తమ తల్లి కోసం ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఆమె ఫొటోను చేతపట్టకుని అక్కడ వెతికారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ తల్లిని తండ్రి హత్య చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. చివరకు నిందితుడైన అశోక్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్న అతడు భార్య అడ్డుతొలగించుకునేందుకు కుంభమేళాకు తీసుకువచ్చి హత్య చేశాడని పోలీస్ అధికారి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com