France: ఫ్రాన్స్ అధీనంలో ఉన్న విమానానికి లైన్ క్లియర్

France: ఫ్రాన్స్ అధీనంలో ఉన్న విమానానికి లైన్ క్లియర్
ఆదివారం విచారణ అనంతరం ఫ్రాన్స్ వీడేందుకు అనుమతి

మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులు ఉన్న విమానానికి ఆటంకాలు తొలిగాయి. మూడు రోజులు నిర్బంధం తర్వాత విమానం నేడు మళ్లీ బయలుదేరనుంది. అయితే షెడ్యూల్ ప్రకారం నికరాగువాకు వెళుతుందా వెనక్కి మళ్లించి దుబాయికీ చేరుతుందా లేదా భారత్‌కు పయనం అవుతుందా అన్నది అధికారులు వెల్లడించలేదు. ఫ్రెంచ్‌ నిబంధనల ప్రకారం ఈ ఘటనపై ఆదివారం న్యాయవిచారణ ప్రారంభమైంది. విమానాన్ని ఆధీనంలోకి తీసుకున్న వాట్రీ విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు ఫ్రాన్స్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్‌ బహిరంగ విచారణ చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరేందుకు అనుమతులు రావడంతో విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని జడ్జీలు హియరింగును రద్దు చేశారు. విమాన ప్రయాణికుల్లో కొందరు తమ బంధువులతో ఫోన్లలో హిందీ, తమిళంలో మాట్లాడారని ఫ్రెంచ్ మీడియా పేర్కొంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా అరోపణలతో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు న్యాయవాది తెలిపారు.


ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన 303 మంది భారతీయులకు ఆటంకాలు తొలగిపోయాయి. సోమవారం వారి విమానం ఫ్రాన్స్‌ను వీడేందుకు అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, మునుపటి షెడ్యూల్ ప్రకారం విమానం నికరాగువాకు వెళుతుందా? లేక భారత్‌కు వస్తుందా? అన్న దానిపై స్పష్టత లేదు. మానవ అక్రమరవాణా అనుమానంతో ఫ్రాన్స్ అధికారులు భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని గురువారం నిలువరించిన విషయం తెలిసిందే. దుబాయి నుంచి భారతీయులతో నికరాగువాకు వెళుతున్న లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానం ఫ్రాన్స్‌లో వాట్రీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు దిగిన సమయంలో అధికారులు దానిని నిలువరించారు.

కాగా, ప్రయాణికులను రెండు రోజుల పాటు ఎయిర్‌పోర్టులోనే ప్రశ్నించారు. విచారణకు ఎయిర్‌పోర్టులోనే ఏర్పాట్లు చేశారు. కోర్టు సిబ్బంది, అనువాదకులు, న్యాయవాదులను అందుబాటులో ఉంచారు. ఆదివారం విచారణ జరిపి ప్రయాణానికి పూర్తి అనుమతులు జారీ చేశారు. కాగా, ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు తేలింది. మరో 10 మంది ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందేందుకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే, విమానం ఎటు వెళుతుందన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇండియాకు వచ్చే అవకాశం ఉందని స్థానిక బార్ అసోసియేషన్ మీడియాకు తెలిపింది.



Tags

Read MoreRead Less
Next Story