గూగుల్ ఉద్యోగులకు గుడ్న్యూస్
By - prasanna |15 Dec 2020 9:21 AM GMT
ఈ విషయాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేశారు.
మూడు రోజులు ఇంట్లో.. మూడు రోజులు ఆఫీసులో పని చేసుకోవచ్చని ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే కరోనా వల్ల ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులను మరి కొన్ని రోజులు అంటే 2021 జూన్ వరకు పొడిగించింది. ఈ విషయాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. కరోనా వల్ల ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఐటీ కంపెనీలన్నీ తిరిగి తమ కార్యకలాపాలన్నీ యధావిధిగా సాగిస్తాయి. అప్పటి వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులు బాటు కల్పిస్తున్నాయి.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com