ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు.. మొట్టమొదటగా వేడుకలు జరిగింది అక్కడే!

పాత ఏడాది గడచిపోయింది.. కొత్త ఏడాది ప్రపంచ యవనికపైకి అడుగుపెట్టింది. కరోనా రూపంలో మానవాళిని తీవ్ర ఇక్కట్ల పాలు చేసిన 2020 కి గుడ్ బై చెబుతూ... 2021 కి జనం ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతున్నారు. గత ఏడాదితో పోల్చితే పెద్దగా సంబరాలు లేనప్పటికీ.. నూతన సంవత్సరం సంతోషాలను అందించాలని ఆకాంక్షిస్తూ ప్రజలు వేడుకలు జరుపుకున్నారు.
కిరిమాటీ సమోవా దీవుల్లో మొట్టమొదటగా వేడుకలు జరిగాయి. ఆ తర్వాత న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వాసులు కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు.
న్యూ ఇయర్ వేడుకలకు పెట్టింది పేరైన సిడ్నీ ఓపేరా హౌజ్లో ప్రజలు 2021 కి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
అటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కొత్త ఏడాదికి ప్రజలు ఉత్సాహంతో స్వాగతం పలికారు. ప్రజల కేరింతలు.. పరస్పర శుభాకాంక్షలతో ప్రధాన నగరాలు హోరెత్తి పోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com