దుబాయ్లో నిర్మిస్తున్న హిందూ మందిరం.. 2022 దీపావళికి సిద్ధం..

X
By - prasanna |25 Jan 2021 2:08 PM IST
దేవాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే బేస్మెంట్ పూర్తయినట్టు పేర్కొన్నారు.
దుబాయ్: దుబాయ్ లోని జెబెల్ అలీ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న హిందూ దేవాలయం వచ్చే ఏడాది అక్టోబర్కు పూర్తవనున్నట్టు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ ఆదివారం వెల్లడించారు. 2022 దీపావళికి దేవాలయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. దేవాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే బేస్మెంట్ పూర్తయినట్టు పేర్కొన్నారు.
ఈ దేవాలయానికి గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. బర్ దుబాయ్ లో ఉన్న సింధి గురు దర్బార్ దేవాలయానికి పొడిగింపుగా ప్రస్తుత దేవాలయ నిర్మాణం జరుగుతోంది. దుబాయ్లో ఉన్న పురాతన దేవాలయాల్లో సింధి గురు దర్బార్ దేవాలయం ఒకటి. 1950లలో ఈ దేవాలయం ప్రారంభమైంది. కొత్తగా నిర్మించబోయే దేవాలయం అరేబియన్ లుక్లో కనిపించనున్నట్టు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com