US: అమెరికా మాల్స్‌లో భారత్‌ బియ్యం మాయం

US: అమెరికా మాల్స్‌లో భారత్‌ బియ్యం మాయం
X
ఎగబడి కొన్న ఎన్నారైలు; గంటల్లో మాయమైన రాయల్‌ బ్రాండ్ రైస్‌...

బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడంతో విదేశాల్లో ఒక్కసారిగా బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో భారత బియ్యానికి ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. బాస్మతీ బియ్యం మినహా మిగిలిన రకాల బియ్యంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరగడంతో.. కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈసారి కొన్ని ప్రాంతాల్లో అతి వృష్టి, కొన్నిచోట్ల అనావృష్టి కారణంగా వరి దిగుబడి తగ్గే అవకాశముంది. దీంతో గత కొన్ని నెలలుగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి.


అంతర్జాతీయంగా వరి పండిండే అనేక దేశాల్లో వివిధ కారణాల వల్ల దిగుబడి తగ్గుతోంది. ముఖ్యంగా మన బియ్యాన్ని వియత్నాం భారీగా దిగుమతి చేసుకుంది. ఇతర దేశాలు కూడా బియ్యం దిగుమతికి ప్రాధాన్యం ఇవ్వడంతో.. భారత ప్రభుత్వం ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భారత్‌ నిర్ణయంతో అమెరికాలోని ఎన్నారైలు బియ్యం కోసం ఎగబడుతున్నారు. దాదాపు అన్ని మాల్స్‌లో బియ్యం స్టాక్‌ కరిగిపోయింది. ఒక కస్టమర్‌కు కేవలం రెండు బ్యాగ్‌ల బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నట్లు మాల్స్‌ రేషన్‌ విధించాయి. అమెరికాలోని ప్రధాన నగరాల్లో అన్ని రకాల బియ్యం బ్రాండ్లను కొనేశారు. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎపుడు ఎత్తివేస్తారో అంచనా లేకపోవడంతో ముందుజాగ్రత్తగా చాలా మంది బియ్యాన్ని దాచుకుంటున్నారు. దీంతో ధరలు కూడా బాగా పెరిగాయి. మరోవైపు ఎగమతులపై నిషేధం లేకున్నా... బాస్మతీ బియ్యానికి కూడా డిమాండ్‌ పెరిగింది. గల్ఫ్‌ దేశాల్లో బాస్మతీకి డిమాండ్‌ పెరుగుతోంది.

Tags

Next Story