Sudiksha Missing: సుదీక్ష తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి కరేబియన్ దేశానికి విహార యాత్ర కోసం వెళ్లి.. అక్కడే అదృశ్యం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతుండంగా.. పోలీసులు ఆమె కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఆమె తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తమ కుమార్తె కనిపించకుండా పోయి 12 రోజులు కావొస్తుండగా.. ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
కోనంకి సుదీక్ష చౌదరి (20) భారత సంతతి విద్యార్థిని. అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. అయితే ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 6న రిసార్ట్ బార్లో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. అనంతరం ఒక యువకుడితో కలిసి చాలా క్లోజ్గా బీచ్లోకి నడుచుకుంటూ వెళ్లింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో స్నేహితులు.. స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలతో గాలించారు. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో బీచ్లో కొట్టుకుపోయిందని తేల్చిచెప్పారు. అయితే పోలీసుల వాదనను సుదీక్ష తల్లిదండ్రులు కొట్టిపారేశారు. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని వాదించారు.
తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. లేదంటే సుదీక్షకు సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె పేరెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డొమినికన్ రిపబ్లిక్ అధికారులకు తల్లిదండ్రులు ఒక లేఖ రాశారు. తమ కుమార్తె చనిపోయినట్లుగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అంతేకాకుండా అమెరికా మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. సుదీక్ష చనిపోయినట్లుగా ప్రకటించాలని డొమినికన్ రిపబ్లిక్ పోలీసులను తల్లిదండ్రులు కోరారు. తమ కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని.. పోలీసుల దర్యాప్తును పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అవసరమైన ఏవైనా లాంఛనాలు లేదా డాక్యుమెంటేషన్కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇక సుదీక్ష తల్లిదండ్రులు రాసిన లేఖ తమకు అందినట్లుగా పోలీసులు కూడా మంగళవారం నిర్ధారించారు.
మార్చి 6న బీచ్లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా సుదీక్ష మాయం అయింది. అయితే ఈ విషయాన్ని స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవలతో జల్లెడ పట్టారు. కానీ నేటికి ఆమె అడ్రస్ దొరకలేదు. దీంతో రియు రిపబ్లికా రిసార్ట్లో ఉన్న వీడియోలను పరిశీలించగా.. ఆమె రిసార్ట్ నుంచి ఒక యువకుడు జాషువా రీబేతో బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అతడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని, బీచ్కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే ఒక అల రావడంతో పడిపోయామని.. తాను బయటకు వచ్చేశాను.. ఆమె కూడా వచ్చేసిందని పేర్కొ్న్నాడు. అనంతరం ఆమె నీళ్లు మింగడంతో వాంతు చేసుకున్నట్లు జాషువా రీబే చెప్పాడు. అనంతరం బీచ్ ఒడ్డున నిద్రపోయామని, ఆమె ఏమైందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. దీంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకుండా అబ్జర్వేషన్లో ఉంచారు.
తాజాగా అధికారులు మరిన్ని వీడియోలను పరిశీలించారు. బార్లో ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నేహితులతో కలిసి ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో జాషువా రీబేతో కాకుండా మరొక సీనియర్ విద్యార్థితో కలిసి మద్యం సేవించినట్లుగా కనిపించింది. అంతేకాకుండా అతడితో చాలా సేపు ముచ్చట్లు పెట్టింది. అతడికి మద్యం అందించినట్లుగా కనిపిస్తోంది. ఈక్రమంలోనే సుదీక్ష తల్లిదండ్రులు స్పందించారు. ఈ కేసులో అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని వివరించారు.
తమ కుమార్తె మృతిని అధికారికంగా ప్రకటించాలని.. సుదీక్ష మరణం విషయంలో ఎవరిపైనా అనుమానం లేదని వెల్లడించారు. అయితే మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని చట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని అర్థం చేసుకున్నామని చెప్పారు. అలాగే ఈ విషయంలో అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని లేఖలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com