Modi-Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

Modi-Trump: అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌
X
ఇరు దేశాల స్నేహ సంబంధాలపై నేతల సంభాషణ..

డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఫోన్ చేశారు. ఇద్దరు నాయకులు భారత్-అమెరికా మధ్య సంబంధాల గురించి చర్చించారు. ‘‘ నా ప్రియమైన మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం ఆనందంగా ఉంది. ఆయన చారిత్రత్మక రెండవ పదవీ కాలం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపాను. పరస్పరం ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం ఇద్దరం కలిసి పనిచేస్తాము అని మోడీ చెప్పారు. నవంబర్ 07 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ప్రధాని మోడీ ఆయనతో మాట్లాడారు. ఆ సమయంలో ఇరువురు నేతల సంభాషణలో, ట్రంప్ ప్రధాని మోడీని ప్రశంసించారు. మోడీ అద్భుతమైన వ్యక్తిగా, ప్రపంచం మొత్తం ఆయనను ప్రేమిస్తోందని అన్నారు. భారతదేశం ఒక అద్భుతమైన దేశమని, ప్రధాని మోడీని, భారతదేశాన్ని తాను నిజమైన మిత్రులుగా భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ప్రపంచ శాంతి కోసం ఇరువురు నాయకులు కలిసి పనిచేయడానికి అంగీకరించారు.

జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికా ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రధాని మోడీ నుంచి ట్రంప్‌కి జైశంకర్ ఒక అభినందన లేఖను తీసుకెళ్లారు.

Tags

Next Story