Oman: ఒమన్‌ ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 8 మంది భారతీయులు క్షేమం

Oman: ఒమన్‌ ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 8 మంది భారతీయులు క్షేమం
X
రక్షించిన ఇండియన్ నేవీ

ఒమన్‌లోని ప్రధాన నౌకాశ్రయం డగ్మ్‌ నుంచి బయలుదేరిన ప్రెస్టీజ్‌ ఫాల్కన్‌ నౌక ఒమన్‌ జలాల్లో బోల్తా పడింది. నౌకలో తూర్పు కార్మోస్‌ నుంచి ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రయాణిస్తున్నట్లు మారిటైమ్‌ సెక్యూరిటీ సెంటర్‌ తెలిపింది. ఓడ యెమెన్‌లోని అడెన్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఓడ ప్రమాదంలో తప్పిపోయిన 16 మంది సిబ్బందిలో తొమ్మిది మందిని రక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ తొమ్మిది మంది సభ్యుల్లో ఎనిమిది మంది భారతీయులు కాగా, ఒకరు శ్రీలంకకు చెందినవారు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒమన్ ప్రధాన నౌకాశ్రయం దుక్మ్ నుంచి బయలుదేరిన ప్రెస్టీజ్ ఫాల్కన్ షిప్ (ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్) ఒమన్ సముద్ర ప్రాంతంలో బోల్తా పడింది. నౌకలో తూర్పు కార్మోస్‌ నుంచి ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రయాణిస్తున్నట్లు మారిటైమ్‌ సెక్యూరిటీ సెంటర్‌ తెలిపింది.

డగ్మ్ నౌకాశ్రయం ఒమన్ నైరుతి తీరంలో ఉంది. ఇది సుల్తానేట్ ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు సమీపంలో ఉంది. ఇది ఒమన్ అతిపెద్ద ఆర్థిక ప్రాజెక్ట్, ఇందులో ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం డుగుమ్ విస్తృత పారిశ్రామిక జోన్‌లో భాగమైంది. జూలై 15న రాత్రి 10 గంటల ప్రాంతంలో మునిగిపోయిన చమురు ట్యాంకర్ ఒమన్ తీరంలో ప్రమాద కాల్‌ని పంపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ద్వారా సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారత నావికాదళం పనిచేస్తోందని చెప్పారు. భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక INS Teg సముద్ర నిఘా విమానం P-8Iతో పాటు ఒమాన్ నౌకలు, సిబ్బందిని మోహరించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.

ఈ నౌకలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు ఉన్నారు. మిగిలిన భారతీయ సిబ్బంది గురించి ఇంకా సమాచారం లేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 'జూలై 15న ఒమన్ తీరంలో బోల్తా పడిన MT ప్రెస్టీజ్ ఫాల్కన్ కోసం ఒమానీ అధికారులు, ఇండియన్ నేవితో ఎంబసీ ఆప్స్‌ను సమన్వయం చేస్తోంది. INS Teg ద్వారా 8 మంది భారతీయులతో సహా 9 మంది సిబ్బంది రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.' అని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

Tags

Next Story