Iran-Israel: ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణ దాడి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తాజా దాడులతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. దీంతో చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్లోని రెండు నగరాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ కోరారు. అందుకు ససేమిరా అన్నారు. ఇక అమెరికా యుద్ధంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో రష్యా హెచ్చరించింది. దాడులకు దిగొద్దని కోరింది. దీంతో రెండు వారాల పాటు ట్రంప్ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇక ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఖోండాబ్లోని భారీ నీటి పరిశోధన రియాక్టర్ సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇక అణు కేంద్రం పరిసర ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఇక ఇరాన్ క్లస్టర్ మందుగుండు సామగ్రి ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇవి వాతావరణంలో పేలి ఎనిమిది కిలోమీటర్ల వ్యాసార్థంలో (4.9 మైళ్ళు) చిన్న క్షిపణులను పంపుతాయి. దీంతోనే ఇజ్రాయెల్లో నష్టం వాటిల్లుతోంది. టెల్ అవీవ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com