
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఫసిఫిక్ మహాసముద్రం వెలుపలి దీవుల సమీపంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ల్యాండ్స్లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు తెలిపారు. మరోవైపు సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.
తోరిషిమా సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత జపాన్ ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఒక మీటరు ఎత్తుకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇజు దీవుల్లోని ప్రజల తీరప్రాంతాలు మరియు నదీ ముఖద్వారాలకు దూరంగా ఉండాలని సలహా కోరింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, తోరిషిమా ద్వీపానికి సమీపంలో ఉదయం 11 గంటలకు 6. 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో .. రెండు గంటల అనంతరం ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com