కరోనా సెకండ్ వేవ్.. మరోసారి లాక్డౌన్ విధింపు

ఫ్రాన్స్లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్య ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ విధించింది. దీంతో లాక్ డౌన్ విధించడానికి కొన్ని గంటల ముందు... ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ప్రజలు స్వస్థలాల బాట పట్టారు. దీంతో ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డుపైకి రావడంతో... పారిస్లో 700 కిలో మీటర్ల మేర వరకు ట్రాఫిక్ స్తంభించింది. నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాలన్ని భారీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మూసుకుపోయాయి. దీంతో బయటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జాంను నియంత్రించలేక పోలీసులు అవస్థలు పడ్డారు.
ఈ ఏడాది మార్చిలోనూ పారిస్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఫ్రాన్స్లో తొలిసారిగా లాక్డౌన్ విధించినప్పుడు పారిస్ నుంచి దాదాపు 12 లక్షల మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. పారిస్ నగరం దాదాపు ఐదో వంతు ఖాళీ అయిపోయింది. గతంలో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇదిలా ఉంటే… లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలను నిల్వ చేసుకోడానికి కూడా జనం పోటీ పడ్డారు. దీంతో షాపుల్లోనూ రద్దీ కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com