మాలి దేశంలో ఒకే కాన్పులో 9మంది జననం
By - TV5 Digital Team |5 May 2021 11:30 AM GMT
ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. పశ్చిమాఫ్రికాలోని మాలికి చెందిన హలీమా సిస్సి.
సాధారణంగా ఒకే కాన్పులో కవలలో, లేక ముగ్గురికి జన్మనిస్తేనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. కానీ... ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. పశ్చిమాఫ్రికాలోని మాలికి చెందిన హలీమా సిస్సి.... తొమ్మిది మంది సంతానానికి జన్మనిచ్చింది. ఆమెకు డెలివరీ చెయడానికి ఇద్దరు డాక్టర్లు శ్రమించారు. తల్లి, తొమ్మిది పిల్లలు క్షేమంగానే ఉన్నారని.. మాలి దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సీబీ తెలిపారు. స్కానింగ్ సమయంలో ఎక్కువ మంది జన్మిస్తారని డాక్టర్లు చెప్పారు. కానీ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చేసరికి ఆమెకే ఆశ్చర్యంగా ఉందని హలీమా తెలిపింది. డెలివరీని సిజేరియన్ ద్వారానే చేసినట్టు డాక్టర్లు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com