Mehul Choksi: : మెహుల్ చోక్సీకి యూకే కోర్టులో చుక్కెదురు

పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి యూకే కోర్టు షాకిచ్చింది. ఆయన చెబుతున్న ‘కిడ్నాప్’ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. చోక్సీ ఆరోపణలే తప్ప ఆయన కిడ్నాప్ కావడం ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరని చెప్పింది. చోక్సీ లాయర్ చూపించిన సందర్భోచిత సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగిస్తామని పేర్కొంటూ.. రూ.7.3 కోట్లు సెక్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలని చోక్సీని ఆదేశించింది.
కేసు ఏంటంటే..
విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ కొంతకాలం ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో తనను భారత్ కు తరలించేందుకు కొంతమంది కుట్ర పన్నారని చోక్సీ ఆరోపించారు. హంగేరీకి చెందిన బార్బారా జబారికతో కలిసి భారత ఏజెంట్లు తనను కిడ్నాప్ చేశారని యూకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జబారిక తనతో స్నేహం నటించి ఆంటిగ్వా నుంచి బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లిందని, తప్పించుకుని బయటపడిన తనను బెల్జియం పోలీసులు అరెస్టు చేశారని చోక్సీ చెప్పాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
