చైనాలో కొత్త కరోనా విలయ తాండవం

అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని లాక్డౌన్, కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో.. అతి త్వరగా కోలుకున్న చైనాను.. ఇప్పుడు మళ్లీ కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ దేశ రాజధాని బీజింగ్కు దక్షిణాన ఉండే హెబై ప్రావిన్స్లో రెండు సిటీల్లో కరోనా మళ్లీ పడగ విప్పింది. తాజాగా అక్కడ 127 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు 183 అసింప్టమాటిక్ కేసులు కూడా నమోదు అయ్యాయి. చైనాలో ఇన్ని కేసులు వెలుగు చూడటం 2019 తర్వాత ఇదే తొలిసారి అని చెబుతున్నారు అధికారులు. కేసుల నఅప్రమత్తమైన అధికారులు హెబై ప్రావిన్స్లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్డౌన్ విధించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆ ప్రాంతంలో రవాణా వ్యవస్థ కూడా మొత్తం నిలిచిపోయింది. అయితే, కరోనా కేసులో చైనాలో మళ్లీ నమోదు కావడానికి మాత్రం.. విదేశీయులే కారణం అని.. అలాగే విదేశాల నుంచి దిగుమతి అయిన ఆహార పదార్థాల కారణంగా చెబుతున్నారు అధికారులు.
ఇటు అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3 వేల మందికి పైగా కరోనా బాధితులు కన్నుమూశారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కరోనా సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. దీంతో అమెరికాలో ఇప్పటివరకు మొత్తం మరణాలు 3 కోట్ల 66 లక్షలకు, పాజిటివ్ కేసులు 2.16 కోట్లకుపైగా చేరుకున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జర్మనీలో అమలు చేస్తున్న లాక్డౌన్ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించేందుకు చాన్స్లర్ యాంజెలా మెర్కెల్ అంగీకరించారు. అలాగే జన సంచారంపై మరికొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు ఆమె తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. జర్మనీలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్డౌన్ను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు 37 వేల 744 కరోనా మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో 8.3 కోట్ల జనాభా ఉండగా 2.65 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో గత ఏడాది నవంబర్ 2 నుంచి పాక్షిక లాక్డౌన్, డిసెంబర్ 16 నుంచి కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరి 10న లాక్డౌన్ ముగించాల్సి ఉండగా పొడిగించారు.
అలాగే గత ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్రిటన్లో కోవిడ్ కారక రోజూ వారీ మరణాల సంఖ్య వెయ్యి దాటింది. కరోనాతో వెయ్యి 41 మరణాలు సంభవించాయని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఒకపక్క దేశవ్యాప్త లాక్డౌన్ విధించి, మరోపక్క వ్యాక్సినేషన్ ఆరంభించినా కరోనా కలకలం ఆగకపోవడం ఆందోళన సృష్టిస్తోంది. అయితే యూరప్తో పోలిస్తే ఇంగ్లండ్లో ఎక్కువమందికి టీకా అందిందని ప్రధాని జాన్సన్ చెప్పారు. ప్రతిపక్షాలు లాక్డౌన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తప్పవని జాన్సన్ చెప్పారు. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేస్తామన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగితే లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యమవుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com