పీఎం మోదీ ఆహ్వానం మేరకు భారత్ సందర్శించనున్న న్యూజిల్యాండ్ ప్రధాని

పీఎం మోదీ ఆహ్వానం మేరకు భారత్ సందర్శించనున్న న్యూజిల్యాండ్ ప్రధాని
X
ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మార్చి 16 నుండి మార్చి 20 వరకు భారతదేశానికి అధికారిక పర్యటన చేస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మార్చి 16 నుండి మార్చి 20 వరకు భారతదేశానికి అధికారిక పర్యటన చేస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

" న్యూజిల్యాండ్ ప్రధానమంత్రి ఆర్‌టి హాన్ లక్సన్ ప్రస్తుత హోదాలో భారతదేశానికి ఇది తొలి పర్యటన అవుతుంది. ఆయన మార్చి 20, 2025న వెల్లింగ్టన్‌కు తిరిగి వెళ్లే ముందు న్యూఢిల్లీ మరియు ముంబైలను సందర్శిస్తారు" అని ప్రకటన పేర్కొంది.

తన పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి లక్సన్ ప్రధాని మోదీ మరియు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో చర్చలు జరుపుతారు. మార్చి 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భారతదేశం-న్యూజిలాండ్ సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావిస్తారు. ఆయన గౌరవార్థం ప్రధాన మంత్రి మోదీ విందును నిర్వహిస్తారు. అదే రోజు రాష్ట్రపతిజీ ద్రౌపది ముర్ముతో కూడా లక్సన్ సమావేశం కానున్నారు" అని ప్రకటనలో తెలిపారు.

మార్చి 17న జరిగే 10వ రైసినా డైలాగ్ 2025 ప్రారంభ సమావేశంలో లక్సన్ పాల్గొని ముఖ్యోపన్యాసం చేయనున్నారు.

మార్చి 19-20 తేదీలలో లక్సన్ ముంబైని సందర్శించనున్నారు, అక్కడ ఆయన భారతీయ వ్యాపార వేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులతో సంభాషిస్తారు.

లక్సన్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. "ఆయనతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారాలు, మీడియా మరియు న్యూజిలాండ్‌లోని భారతీయ డయాస్పోరా కమ్యూనిటీ సభ్యులు కూడా ఉంటారు'' అని ప్రకటన పేర్కొంది.

లక్సన్ పర్యటన రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలను పునరుద్ఘాటిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. "ప్రధానమంత్రి ఆర్‌టి హాన్ లక్సన్ పర్యటన భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య దీర్ఘకాలిక మరియు శాశ్వత సంబంధాలను నొక్కి చెబుతుంది. అన్ని రంగాలలో ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ,సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి రెండు దేశాల నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది" అని ప్రకటన పేర్కొంది.

Tags

Next Story