Pakisthan: బుర్జ్ ఖలీఫాపై కనపడని పాక్ జాతీయ జెండా

Pakisthan: బుర్జ్ ఖలీఫాపై కనపడని పాక్ జాతీయ జెండా
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్తాన్ కు అవమానం

ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. ఎక్కడ ఎక్కడ ఉన్న పాకిస్తానీలంతా తమ దేశ స్వాతంత్రం రోజున పులకించిపోయి సంబరాలు చేసుకుంటారు. అయితే అదే రోజు వారికి అవమానం జరిగింది అని వాపోతున్నారు. ఈ సారి ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా..ప్రత్యేక సందర్భాల్లో ఈ భవనంపై అందుకు సంబంధించిన చిత్రాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే, తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది 2716.5 అడుగుల ఎత్తైన ఈ భవనంపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తారని పాకిస్తానీయులు అనుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. కౌంట్ డౌన్ మొదలుపెట్టారు.

అర్ధరాత్రి దాటిన కొద్ది నిమిషాల తరువాత కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై పాక్ జాతీయ జెండా కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిరాశ చెందిన ప్రజలు తమ మాతృభూమికి మద్దతునిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన మొత్తాన్ని ఓ మహిళా.. తన మొబైల్ కెమెరాలో రికార్డు చేసింది. అనంతరం ఆమే మాట్లాడుతూ.. “సమయం అర్ధరాత్రి 12.01 గంటలు, బుర్జ్ ఖలీఫాపై పాకిస్థాన్ జాతీయ జెండాను ప్రదర్శించబోమని దుబాయ్ అధికారులు తెలియజేసారని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పాకిస్తాన్ దేశం1947లో స్వతంత్రం పొందింది. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఒకే సంవత్సరం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందాయి. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోగా పాకిస్తాన్ ఆగష్టు 14 న జరుపుకుంటుంది. విభజన సమయంలో పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మరియు తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడింది. అయితే పాకిస్తాన్ ఐక్యంగా ఉండలేకపోయింది. దీంతో 1971లో తూర్పు పాకిస్తానీ తీవ్ర పోరాటం తర్వాత స్వాతంత్ర్యం పొందగా.. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది.

Tags

Read MoreRead Less
Next Story