China : విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు.. ... ప్రయాణికులు పరుగులు..!

China : చైనాలోని చాంగ్కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకులోనై హాహాకారాలు చేశారు. ఆ సమయంలో ప్రయాణంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది క్రూ ఉన్నారు. వీరిలో 25 మంది గాయపడ్డారు.
టిబెట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం రన్వే నుంచి మరికొన్ని సెకన్లలో టేకాఫ్ అవుతుందనగా మంటలు అండుకుని డైరెక్షన్ మారిపోయింది. అప్రమత్తమైన పైలెట్ ఫ్లైట్ను నిలిపివేసి.. హుటాహిటిన అత్యవసర ద్వారం నుంచి ప్యాసెంజర్లను దించేశారు.
ప్రమాదానికి కారణాలపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు. రెండు నెలల కిందట ఓ విమాన ప్రమాదంలో 132 చనిపోయిన ఘటన మరువక ముందే.. మరో యాక్సిడెంట్ జరగడం చర్చనీయాంశంగా మారింది.
Tibet Airlines plane in flames, passengers #evacuated before take-off in western China.
— Chaudhary Parvez (@ChaudharyParvez) May 12, 2022
A #plane has gone off a runway in western #China and caught on #fire.#Tiber #airlines #accident #CCTV #BreakingNews pic.twitter.com/72tD72nBAo
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com