కూటమి గెలుపు పోలండ్లో సంబరాలు

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జన సేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించింది. 164 సీట్లతో కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పర్చబోతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. ఇక ఈ క్రమంలో పోలండ్లోని చంద్రబాబు ఫాలోవర్లు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన కాట్రగడ్డ చందు, విజయ్, IT నిపుణులైన రామ సతీష్ వారి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. వీరంతా కలిసి చంద్రబాబు విజయాన్ని అక్కడ బాణసంచా వెలిగించి, స్వీట్స్ పంచుకుని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కాట్రగడ్డ చందు మరియు విజయ్ గార్లు 200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలిపించి అలాగే ఎంతోమంది తెలుగు వారికి పోలాండ్ లో సహాయ సహకారాలు అందిస్తు్న్నారు. రామ సతీష్ వంటి వారు పోలాండ్ లో మన తెలుగు వారి కోసం అండగా నిలిచి, తెలుగు దేశం పార్టీ కోసం కొంత కాలంగా చురుకుగా పని చేస్తున్నారు.
అదే విధంగా ఈ విజయోత్సవ కార్యక్రమంలో IT నిపుణులు రామ్మోహన్ గారు, కిరణ్,సచిన్, ప్రవీణ్, పవన్, సందీప్, రామనాయుడు, సురేష్, మోహన్, మహేష్, వినయ్, మౌర్య , శైలేంద్ర, నీల, విశాల్, మల్లి, కిరణ్, ఆజాద్, అభిలాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com