లక్ అంటే అదీ మరి.. 25 సంవత్సరాల పాటు నెలకు రూ. 5.6 లక్షలు

లక్ అంటే అదీ మరి.. 25 సంవత్సరాల పాటు నెలకు రూ. 5.6 లక్షలు
ఒక్కోసారి అదృష్టం అలానే కలిసి వస్తుంది. ఉన్నఊరుని, కన్నతల్లిని వదిలి పెట్టి బతుకు దెరువు కోసం సౌదికి వెళ్ళిన భారతీయులు ఎంతో మంది ఉంటారు.

ఒక్కోసారి అదృష్టం అలానే కలిసి వస్తుంది. ఉన్నఊరుని, కన్నతల్లిని వదిలి పెట్టి బతుకు దెరువు కోసం సౌదికి వెళ్ళిన భారతీయులు ఎంతో మంది ఉంటారు. కష్టపడుతూ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. అలాగే అక్కడ ఉన్న వారికి లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆలోచన కూడా కలుగుతుంది. ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా తగలకపోతుందా అని ఆశపడుతుంటారు.

సౌదీకి చెందిన భారతీయుడు UAEలో లాటరీని గెలుచుకున్నాడు. దీని ప్రకారం 25 సంవత్సరాల పాటు నెలకు రూ. 5.6 లక్షలు పొందుతారు. ఒక భారతీయ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఈ అదృష్టం వరించింది. రాఫిల్ డ్రాలో పాల్గొన్న మొదటి విదేశీ జాతీయుడుగా రికార్డులకు ఎక్కారు. దీనితో, అతను రాబోయే 25 సంవత్సరాలకు ప్రతి నెలా రూ. 5.6 లక్షలకు పైగా సంపాదిస్తాడు.

49 ఏళ్ల భారతీయుడు మగేష్ కుమార్ నటరాజన్ లాటరీ గెలుచుకున్న విషయాన్ని వివరిస్తూ.. “నేను నా జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను. నా చదువు పూర్తి చేయడానికి సమాజంలో చాలా మంది నాకు సహకరించారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది అని నటరాజన్ పేర్కొన్నారు.

తన జీవితంలో ఎక్కువ భాగం అంబూర్‌లో గడిపిన నటరాజన్, 2019 నుండి ఈ సంవత్సరం ఆరంభం వరకు నాలుగు సంవత్సరాల అసైన్‌మెంట్ కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అతనికి అదృష్టం లాటరీ రూపంలో తలుపు తడుతుందని అస్సలు ఊహించలేదు.

డ్రాలో గెలుపొందిన తర్వాత, నటరాజన్ తన కుమార్తెల చదువు కోసం డబ్బును ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాడు. "ఇది నమ్మశక్యం కాని క్షణం, ఇది నా జీవితంలో సంతోషకరమైన మరపురాని రోజులలో ఒకటిగా మారింది" అని ఇద్దరు కుమార్తెల తండ్రి చెప్పారు. "నేను నా కుమార్తెల చదువుపై పెట్టుబడి పెట్టాలని, నా కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కూడా ప్లాన్ చేస్తున్నాను" అని అతను చెప్పాడు.

తాజా విజేత గురించి వ్యాఖ్యానిస్తూ, ఎమిరేట్స్ డ్రాలో మేనేజింగ్ పార్టనర్, మొహమ్మద్ బెహ్రూజియన్ అలవాది ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ మంది జీవితాలను మార్చడం మా లక్ష్యం." అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story