Somalia beach: సోమాలియా బీచ్లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి.. 63 మందికి గాయాలు

X
By - jyotsna |4 Aug 2024 6:45 AM IST
కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
ఆఫ్రికా ఖండంలోని అత్యంత పేద, కల్లోలభరిత దేశాల్లో ఒకటైన సోమాలియాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఓ హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 32 మంది మరణించారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బీచ్ కు సమీపంలో ఉన్న ఈ హోటల్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరగడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com