ముంబై పేలుళ్ల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్

ముంబై పేలుళ్ల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్  అరెస్ట్
కెనడాలో అదుపులోకి తీసుకున్న ఇంటర్ పోల్

2002-2003 ముంబై బాంబు పేలుళ్ల కుట్రలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడైన మహ్మద్ బషీర్‌ను కెనడా భద్రతా సంస్థ అరెస్ట్ చేసింది. నిందితుడు కెనడా నుంచి పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు.

డిసెంబర్ 2002 నుంచి మార్చి 2003 మధ్య ముంబైని మూడు వరుస పేలుళ్ళు ట్రిపుల్ పేలుళ్లు కుదిపేశాయి. 2002లో ముంబై సెంట్రల్ స్టేషన్ పేలుడు, 2003 విలేపార్లే పేలుడు, 2003 మార్చి నెలలో ములుండ్ రైలు పేలుళ్ల లో 12 మంది మరణించారు, ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఘటనల్లో బషీర్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. హత్య, ఉగ్రవాద చర్యలు, కుట్ర, ఇతర ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుజారీ చేసింది. 2002-2003 ముంబై పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన వారు 10 మంది. వీరిలో కొందరికి ప్రత్యేక ఉగ్రవాద నిరోధక చట్టం కింద కోర్టు జీవిత ఖైదు విధించింది. జైలు జీవితం గడిపిన వారిలో ప్రధాన నిందితుడు ముజమ్మిల్ అన్సారీ కూడా ఉన్నారు. మరో ఐదుగురికి పదేళ్ల జైలు, ఇంకో ఇద్దరికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడింది.

ఇక నిందితుడు బషీర్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాలో కీలక వ్యక్తి. బషీర్ 1961లో కేరళలోని కప్రస్సేరి అనే గ్రామంలో జన్మించాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. అలువా టౌన్‌లో సిమికి చెందిన ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. 1980 సంవత్సరం చివరిలో సిమికి అఖిల భారత అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు. చాలా మంది యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకు బషీర్ ప్రేరేపించాడు. అధికారుల వివరాల ప్రకారం.. బషీర్ ఇండియన్ ముజాహిదీన్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. 2002 – 03 సంవత్సరాల్లో ముంబై పేలుళ్ల తరువాత బషీర్ పలు ప్రాంతాల్లో పోలీసులు కళ్లుగప్పి తిరిగాడు. 2011 నుండి కెనడాలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. బషీర్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు. అయితే బషీర్ ఇప్పటికీ నిఘా సంస్థల రాడార్‌లో ఉన్నాడు. అతని పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరైన బషీర్‌ను ఇండియాకు రప్పించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం బషీర్ సోదరి రక్త నమూనాలను సేకరించేందుకు ముంబై పోలీసులు ఎర్నాకులంలో ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

Tags

Read MoreRead Less
Next Story