International: అమెరికాలో భారీ పేలుడు..18వేల ఆవులు మృతి

అమెరికాలోని టెక్సాస్లో భారీ ప్రమాదం జరిగింది. డిమ్మిట్లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. దీంతో 18 వేల ఆవులు చనిపోయాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ దాదాపు 300 కోట్లు ఉంటుందని అంచనా. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంతపెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారిని అక్కడి జంతు సంరక్షణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన ఈ నెల 10న జరిగినట్లు తెలుస్తోంది. డెయిరీఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్ అధికమొత్తంలో విడుదలైందని అందుకే ఆవులు మృతి చెంది ఉంటాయంటున్నారు. అయితే, ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. డెయిరీ ఫాంలో సాధారణంగానే మీథేన్ వాయువు వెలువడుతుంది. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దాని ద్వారా మీథేన్ బయటికి వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com