Trump : పెట్టుబడులను ఆకర్షించేందుకు.. గోల్డ్ కార్డు వీసా .. ట్రంప్ మరో సంచలన నిర్ణయం

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పెట్టుబడి దారులను తమ దేశానికి రప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల్లో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అదే గోల్డ్ కార్డు వీసా! ఇది గ్రీన్ కార్డు తరహాలోనే సౌలభ్యాలు కలిగి ఉంటుంది. ఈ వీసా పొందే వ్యక్తులు అమెరికాలో ప్రభు త్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ కార్డు కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తమ దేశంలోకి వస్తారని ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 44 కోట్లు) పెట్టుబడి దారులకు ఈ గోల్డ్ కార్డు వీసాలను మంజూరు చేస్తామని చెప్పారు. అమెరి కాలో పెట్టుబడి దారుల కోసం ప్రవేశపె ట్టిన ఈబీ-5 వీసా పాలసీని మార్చను న్నట్టు తెలిపారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్ కార్డ్ లను ఇవ్వనున్నట్లు వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ తెలిపారు. ఈ గోల్డ్ కార్డు వీసాను ఇప్పటి వరకు ప్ర పంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com