Wedding: బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి

హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్ లో పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో వర్క్ చేస్తున్నాడు. ఇండియాకి వచ్చి వివాహ చేసుకునేందుకు ముహమ్మద్ లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్ లో పెళ్లి చేసుకున్నాడు. అతను అంత త్వరగా పెళ్లి చేసుకో అనారోగ్యంతో ఉన్న పెళ్లి కూతురు తాత మంచాన పడ్డడాడు. ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో త్వరగా ఈ పెళ్లి చేశారు. ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది.
అయితే వారి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు ఎలాగైనా వివాహం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆన్లైన్లో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం అనారోగ్యంతో ఉన్న వధువు తాత చివరి కోరికను తీర్చేందుకు ఆ పెళ్లి వీలైనంత త్వరగా పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు ఈ పని చేశారు. ఈ క్రమంలోనే ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్లోనే వారి పెళ్లి తంతు పూర్తి చేశారు. మండీలో నవంబర్ 4వ తేదీన (సోమవారం) వీడియో కాల్లో వారి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత అద్నాన్ కుటుంబం సంప్రదాయ ఊరేగింపును కూడా నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. 2023 జూలైలో సిమ్లాలోని కోట్ఘర్కు చెందిన మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆశిష్ సింఘా, శివాని ఠాకూర్ లు కులులోని భుంతర్కు చెందిన కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్ లో పెళ్లి చేశారు. వీరి పెళ్లి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com