White house : మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుపై వేధింపులను ఖండించిన వైట్ హౌస్

White house :  మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుపై  వేధింపులను ఖండించిన వైట్ హౌస్
భారతదేశంలో మైనారిటీ హక్కుల పై మోదిని ప్రశ్నించిన మహిళా విలేకరి

భారతదేశంలో మైనారిటీ హక్కులపై మోడీని ప్రశ్నించిన కారణంగా ఒక విలేఖరిని ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేయడాన్ని వైట్ హౌస్ ఖండించింది. జర్నలిస్టులపై ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రకంగా అయినా దాడి చెయ్యటం అమెరికా కు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని చెప్పింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోదీని ప్రశ్నించిన తమ విలేఖరి వేధింపులకు గురవుతోందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. భారత్ లో ముస్లింలు సహా ఇతర మైనారిటీల హక్కుల విషయాన్ని ప్రశ్నించినందుకు తమ జర్నలిస్టును ఆన్ లైన్ లో వేధిస్తున్నారని ఈ విషయం పై స్పందించాలి వైట్ హౌస్ ను కోరింది.

జర్నలిస్ట్ సబ్రీనా సిద్దిఖీ సైబర్ వేధింపులకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని జాతీయ భద్రతామండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సమన్వయకర్త జాన్ కిర్బీ చెప్పారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులపై ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి రకమైన దాడి అయినా ఖండించాల్సిందేనన్నది అమెరికా ఉద్దేశమని పేర్కొన్నారు. ఇలా వేధింపులకు గురిచేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి పనికిరాదని వ్యాఖ్యానించారు.

భారత్ లో ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల పక్షపాత వైఖరి గురించి మీరేమంటారు? ఇండియాలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? అని ప్రధాని మోదీని సబ్రీనా ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ మోదీ ఈ ప్రశ్న తనను సర్ ప్రైజ్ చేసిందని అన్నారు. మనమంతా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యమే మన ఆత్మ అని, పక్షపాతానికి ప్రజాస్వామ్యంలో చోటులేదని ప్రధాని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story