Pig Kidney Transplant: బతికున్న మనిషికి పంది కిడ్నీ ..

Pig Kidney Transplant: బతికున్న మనిషికి పంది కిడ్నీ ..
ప్రపంచంలోనే తొలిసారి..

ప్రపంచంలోనే తొలిసారి ఓ సజీవ రోగికి పంది కిడ్నీ మార్పిడి జరిగింది. అమెరికాలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైనట్టు అక్కడి వైద్యులు తెలిపారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి పంది కిడ్నీని అమర్చినట్టు మసాచుసెట్స్‌ ఆసుపత్రి వెల్లడించింది. 62 ఏండ్ల రోగి రెండు కిడ్నీలు ఫెయిలవ్వటంతో శనివారం అతనికి పంది కిడ్నీని మార్పిడి చేశారు.

మసాచుసెట్స్‌లోని వేమౌత్‌కు చెందిన రిచర్డ్ స్లేమాన్ అనే 62ఏళ్ల డయాలసిస్‌పై ఏడేళ్ల క్రితం 2018లో అదే ఆసుపత్రిలో మానవ మూత్రపిండ మార్పిడిని చేయించుకున్నాడు. అయితే, ఐదేళ్ల తర్వాత ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అప్పటినుంచి డయాలసిస్ పైనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చివరి స్టేజీ మూత్రపిండాల వ్యాధితో అతడు బాధపడుతున్నాడు.

అయితే, మార్చి 16న దాదాపు 4 గంటల శస్త్రచికిత్స నిర్వహించి అతడికి విజయవంతంగా పంది కిడ్నీని అమర్చినట్టు బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి రిచర్డ్ బాగానే కోలుకుంటున్నాడని, త్వరలో డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు పేర్కొన్నారు. బతికి ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చడం వైద్యచరిత్రలో ఇదే మొదటిసారిగా వైద్యులు తెలిపారు. జంతువుల నుంచి మానువులకు కిడ్నీ మార్పిడి ప్రక్రియ దీర్ఘకాలిక ఫలితాలపై నిపుణులు చాలా ఆసక్తిగా ఉన్నారని లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్‌సీ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌ కిడ్నీ, ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డైరెక్టర్ డాక్టర్ జిమ్ కిమ్ అన్నారు.

మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని ఈజెనెసిస్ ద్వారా ఈ కిడ్నీని అందించారు. అయితే, జన్యుపరంగా సవరించిన ఒక పంది నుంచి ఈ కిడ్నీని సేకరించారు. కొన్ని జన్యుపరంగా మానవులకు వ్యాధులు సోకే అవకాశం ఉన్న పందులకు అంతర్లీనంగా ఉండే వైరస్‌లను కూడా తొలగించారు. ఇదేవిధంగా, ఎజెనెసిస్ ద్వారా జన్యుపరంగా సవరించిన పందుల నుంచి మూత్రపిండాలు విజయవంతంగా కోతులలోకి మార్పిడి చేశారు. అయితే, ఆ కోతులు సగటున 176 రోజులు సజీవంగా ఉన్నాయని పరిశోధకులు అక్టోబర్‌లో నేచర్ జర్నల్‌లో నివేదించారు.

బాధిత వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ పంది అవయవాన్ని తిప్పికొట్టకుండా నిరోధించేలా డ్రగ్స్‌లో ఎలెడాన్ ఫార్మాస్యూటికల్స్ టెగోప్రుబార్ట్ అనే ప్రయోగాత్మక యాంటీబాడీ ఉంటుంది. ఈ సర్జరీ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పురోగతిని సూచిస్తుంది. అవయవాలు లేదా కణజాలాలను ఒక జాతి నుంచి మరొక జాతికి మార్పిడి చేయొచ్చునని నిరూపితమైందని ఎన్‌వైయూ లాంగోన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న అనేక వందల వేల మందికి అవయవాలకు ప్రత్యామ్నాయంగా మారిందని ఆయన తెలిపారు. యునైటెడ్ నెట్‌వర్క్ ఫర్ ఆర్గాన్ ప్రకారం.. అమెరికాలో లక్ష కన్నా ఎక్కువ మంది ప్రజలు అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. మూత్రపిండాలకు అత్యధిక డిమాండ్ ఉంది. గతంలో న్యూయార్క్ యూనివర్శిటీ సర్జన్లు బ్రెయిన్ డెడ్ వ్యక్తులకు మాత్రమే పంది మూత్రపిండాలను మార్పిడి చేశారు.


Tags

Read MoreRead Less
Next Story