USA : స్కూల్ టీచర్లపై విద్యార్థి కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం

ఇద్దరు టీచర్లపై కాల్పులు జరిపాడు ఓ విద్యార్థి. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్ లో బుధవారం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. బుధవారం ఉదయం సిటీ పార్క్ పరిసరాల్లోని ఈస్ట్ హై స్కూల్ లో కాల్పులు జరిగాయి. నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం వెతుకుతున్నట్లు డెన్వర్ పోలీస్ చీఫ్ రాన్ థామస్ మీడియాకు తెలిపారు. స్కూల్ సిబ్బంది విద్యార్థులను తనికీ చేస్తుండగా కాల్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని హాస్పిటలకు తరలించామని... ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
2022లో US పాఠశాలల్లో డజన్ల కొద్దీ కాల్పులు జరిగాయి, పలువులు మరణించగా, చాలామందికి గాయాలయ్యాయి. మేలో టెక్సాస్లోని ఉవాల్డేలో ఒక సాయుధుడు 19 మంది పిల్లలను, ఇద్దరు పెద్దలను హతమార్చినప్పుడు అత్యంత ఘోరమైన సంఘటనలో ఒకటి జరిగింది. ఈస్ట్ హైలోని 2,500 మంది విద్యార్థులకు క్లాసులు ఈ రోజు రద్దు చేయబడ్డాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఇద్దరు సాయుధ పోలీసు అధికారులు పాఠశాలలో పోస్ట్ చేయబడతారని జిల్లా నిర్వాహకుడు అలెక్స్ మర్రెరో చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com