తెలంగాణలో బీజేపీ పుంజుకోదు.. వాళ్లకు ప్యూచర్ లేదు- ఉత్తమ్

పార్లమెంట్‌లో తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపిస్తామన్నారు ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు. 16 ఎంపీలు గెలుస్తామన్న టీఆర్ఎస్ అహంకారానికి ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పారని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయని కోమటిరెడ్డి చెప్పారు. ప్రశ్నించే గొంతు ఉండాలనే తమను ఆదరించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ముగ్గురు ఎంపీలను PCC నేతలు గాంధీభవన్‌లో ఘనంగా సన్మానించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story